ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించిన దానం

కృష్ణా డెల్టాకు నీటిని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అలా ఆపకపోతే హైదరాబాదుకు అన్యాయం చేసినవారవుతారని ఆయన అన్నారు. హైదరాబాద్ నగర శివారు మున్సిపాలిటీల్లో కొన్ని చోట్ల వారం రోజులకు కూడా మచినీరు వచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదల సబబేనని నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కె. జానా రెడ్డి వంటివారు వ్యాఖ్యానించడం సరి కాదని ఆయన అన్నారు.
మెడికల్ సీట్ల విషయంలో కూడా హైదరాబాదుకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. నగరంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాదుకు అన్యాయం జరిగితే తాము ప్రేక్షక పాత్ర వహించబోమని ఆయన అన్నారు. తమ వాణిని బలంగా వినిపిస్తామని ఆయన చెప్పారు. మెడికల్ సీట్ల కేటాయింపులో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారని ఆయన అన్నారు.
కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులతో పాటు కాంగ్రెసుకు చెందిన తెలంగాణ ప్రాంత నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటి కాంగ్రెసు నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా దానం నాగేందర్ ఆ వర్గంలో చేరారు.












Click it and Unblock the Notifications