ఇందిరబాట: 'మంత్రుల'ను చల్లార్చిన కిరణ్ కుమార్ రెడ్డి

విద్యుత్ సంక్షోభం, ఎరువులు, విత్తనాలు, నీటి సమస్యలపై చర్చించారు. విద్యుత్ పరిస్థితిపై ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి మంత్రులకు, అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయాలను సూచించాలని కోరారు. ఈ నెల 18న సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తామని, రాష్ట్రపతి ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఇందిర బాట కార్యక్రమంలో విద్యుత్, సాగు, తాగు నీటి సమస్యలపై ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తూనే సంక్షేమ పథకాలు ముందుకు తీసుకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.
మంత్రులు ఆయా జిల్లాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అధికారుల సమక్షంలో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ మంత్రులతో కొద్దిసేపు విడిగా సమావేశమయ్యారు. పలు సమస్యలపై ప్రజలు నిలదీసే అవకాశం ఉన్నందున ఇందిర బాటను రాష్ట్రపతి ఎన్నికల తర్వాతకు వాయిదా వేసుకోవాలని మంత్రులు సిఎంను కోరినట్లుగా తెలుస్తోంది.
ప్రధానంగా ఉన్న సమస్యలను ఇతరత్రా కారణాలు చూపి దాటవేసే ప్రయత్నం చేయలేమని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సిఎం వారికి నచ్చజెప్పారు. దీంతో వారు సుముఖత వ్యక్తం చేశారు. దాంతో ఇందిర బాట యథావిధిగా ఈ నెల 12-14 వరకు జరగనుంది. ఈ కార్యక్రమంపై మంత్రి ధర్మాన నేతృత్వంలోని కమిటీ దిశా నిర్దేశనం చేస్తుందని సిఎం చెప్పారు.












Click it and Unblock the Notifications