వివాదాస్పదమైన సీతారామాంజనేయులు ఎన్కౌంటర్లు

2002లో ఆ కర్నూలు, గుంటూరు జిల్లాలలో జరిగిన ఎన్కౌంటర్లపై జిల్లా మానవ హక్కుల వేదిక దాఖలు చేసిన పిటిషన్ పైన ఎన్హెచ్ఆర్సి పదేళ్లపాటు విచారణ చేపట్టింది. ఎన్కౌంటర్లు బూటకమని తేల్చింది. సీతారామాంజనేయులు హయాంలో గుంటూరులో ఆరు, కర్నూలులో పది ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ ఎన్కౌంటర్లలో మృతి చెందిన వారంతా బడుగు, బలహీన వర్గాల వారు, నిరుపేదలే అని ఎన్హెచ్ఆర్సి తెలిపింది. ఇవన్నీ ఏకపక్షంగా జరిగినట్లు భావిస్తోంది.
ఎన్హెచ్ఆర్సి ఆదేశాల మేరకు వెంటనే బాధితులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్కారు సూచనల మేరకు ఆయా జిల్లా తహశీల్దార్లు బాధితులకు చెక్కులను అందజేసినట్లుగా తెలుస్తోంది. సీతారామాంజనేయులు ఎన్కౌంటర్లపై గుంటూరు జిల్లా న్యాయవాది, మానవహక్కుల వేదిక కార్యకర్త చంద్రశేఖర్ ఎన్హెచ్ఆర్సికి ఫిర్యాదు చేశారు.
కాగా ఎన్హెచ్ఆర్సి ఇచ్చిన తీర్పును చంద్రశేఖర్ స్వాగతించారు. సీతారామాంజనేయులు 16 నకిలీ ఎన్కౌంటర్లకు పాల్పడ్డారని అందుకు 80 లక్షల నష్టపరిహారం బాధిత కుటుంబాలకు ఇవ్వాలని హక్కుల కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఆయన తెలిపారు. ఈ నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించకుండా ఆయన నుంచే వసూలు చేయించి ఉండాల్సిందని ఆయన అన్నారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications