నడిరోడ్డుపై కాల్చేయాలి: టిజి వెంకటేష్ సంచలన వ్యాఖ్య

తాను హానెస్ట్ అధికారినని కొందరు చెబుతుంటారని, ప్రజలకు పని చేయనప్పుడు హానెస్ట్ ఏంటని ప్రశ్నించారు. హానెస్ట్ ముఖ్యం కాదని పని చేయడం ముఖ్యమన్నారు. ఒక పని చేయలేని అధికారి ఉంటే ఆ వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుందని అన్నారు. కొందరు ఐఏఎస్ అధికారులకు తలబిరుసు అన్నారు. ప్రజలకు సేవ చేయని అధికారులనే కాదు రాజకీయ నేతలనూ కాల్చి చంపినా తప్పు లేదన్నారు.
అధికారులు పని చేయకపోతే అమెరికా విధానాన్ని అమలపరుచాలన్నారు. అలా అయితే వ్యవస్థ బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మారగానే వ్యవస్థ కూడా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా టిజి వెంకటేష్ సంచలనాలకు మారుపేరు. తెలంగాణ విషయమైనా మరే విషయమైనా సూటిగానే ధాటిగా స్పందిస్తారు.
ప్రత్యేక తెలంగాణ విషయంలో ఆయన తెలంగాణవాదులకు పలుమార్లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన తెలంగాణవాదులపై తన ఎదురుదాడి తగ్గిస్తానని చెప్పారు. ఇక నుండి తాము సై అంటే సై అనమని, తెలంగాణవాదులను ప్రేమతో మసులుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications