కట్నం కోసం భార్యచే మూత్రం తాగించిన భర్త అరెస్ట్

తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని, మూత్రపానం చేయిస్తున్నాడని ఆమె శనివారం జ్ఞానభారతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దావణగెరెలోని ఓ పారిశ్రామికవేత్త కూతురు అయిన ఆమెకు దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరుకు చెందిన ఆకాష్ రాజ్తో గత ఏడేది వివాహం అయింది.
దంత వైద్యుడైన ఆకాశ్ రాజ్కు వివాహం సమయంలో కిలో బంగారు ఆభరణాలు, ఐదు కిలోల వెండి వస్తువులను కట్నంగా ఇచ్చారు. మరో రూ.25 లక్షల నగదు కావాలని ఆకాశ్ రాజ్ రోజూ భార్యను వేధించేవాడు. వివాహమైన రెండో రోజు నుంచే శీలాన్ని శంకిస్తూ మూత్రాన్ని తాగించేవాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అతనిని పుత్తూరులో అరెస్టు చేసి బెంగళూరుకు తరలించారు. కాగా తన వివాహ జీవితం మొత్తం విషాదకరమైనదే అని, తాను భూమి మీదనే నరకం చూశానని చెప్పారు. తనను ఇళ్లు దాటనని, తాను ఇతరులు ఎవరితోనైనా మాట్లాడితే అనుమానించే వాడని చెప్పారు.












Click it and Unblock the Notifications