వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్సీపి క్రైసిస్: సోనియా నో కామెంట్, చర్చిస్తామని పిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపితో సమస్యలపై చర్చిస్తామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. ఎన్సీపి సంక్షోభంపై మాట్లాడడానికి మాత్రం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నిరాకరించారు. ఎన్సీపితో మాట్లాడుతున్నామని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సంకీర్ణ ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని ఎన్సీపి హెచ్చరించిన నేపథ్యంలో ప్రధాని ఆ విధంగా అన్నారు.

ప్రభుత్వం సజావుగా పనిచేయడానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, సమస్యలపై ఎన్సీపితో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుందని ఆయన సమాధానమిచ్చారు.

ఎన్సిపి సంక్షోభం త్వరలోనే కొలిక్కి వస్తుందా అని మీడియా ప్రతినిధులు అడగ్గా "మీ ప్రశ్నలకు వేటికీ నేను సమాధానాలు ఇవ్వను" అని సోనియా గాంధీ అన్నారు. ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుష్మా స్వరాజ్, సోనియా గాంధీ కలిసి పార్లమెంటులోని ఆమె గదిలోకి వెళ్లారు.

తమ డిమాండ్లను అంగీకరించకపోతే యుపిఎ ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని ఎన్సీపి కాంగ్రెసును హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సజావుగా పని చేయడానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలనేది ఎన్సీపి ప్రధాన డిమాండ్. కేంద్ర మంత్రి పదవులకు ప్రణబ్ ముఖర్జీ, ప్రఫుల్ పటేల్ ఇప్పటికే రాజీనామాలు చేసినట్లు చెబుతున్నారు.

English summary

 Prime Minister Manmohan Singh on Wednesday said Congress is ready to discuss issues with NCP issues that concern them even as Congress president Sonia Gandhi declined comments on the stand-off with the coalition partner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X