వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమ వేధింపులకు యువతి బలి: ప్రియురాలిపై దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nalgonda District
నల్గొండ/ఏలూరు/హైదరాబాద్: ప్రేమోన్మాది వేధింపులతో పదిహేడేళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లాలోని జూలూరులో ఈ సంఘటన జరిగింది. ఓ ప్రయివేటు కళాశాలలో చదువుతున్న ఈ అమ్మాయి గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఓ విద్యార్థి తమ అమ్మాయిని నిత్యం వేధిస్తున్న కారణంగానే ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం గనిపూడి వీధిలో శుక్రవారం దారుణం జరిగింది. ఉదయం ఓ ప్రియుడు బ్లేడుతో ప్రియురాలి గొంతు కోసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ దాడికి పాల్పడిన ప్రియుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లాలోని పెంటపాడు మండలం ప్రత్తిపాడు వద్ద ఆగి ఉన్న లారీని తుని నుండి విజయవాడకు కూలీలతో వెళుతున్న మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 24 మంది కూలీలు ఉన్నారు. క్షతగాత్రులను తాడేపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

విజయనగరం జిల్లా పూసపాటిరేగలో జాతీయ రహదారిపై కనిమెట్ట సమీపంలో ఉదయం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికిక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

English summary
An intermediate student from Nalgonda district, 17 year old, committed suicide on Thursday night for torcher.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X