ఆర్టీసి బస్సులో గొంతు కోసిన సైకో: కొనసాగుతున్న వేట

దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లా పోలీసులు అడవిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలోని బత్తలవల్లం రిజర్వ్ ఫారెస్టులో 150 మంది పోలీసులతో కూడిన ఎనిమిది గ్రూపులు దాదాపు పద్దెనిమిది గంటల పాటు గాలించాయి. అక్కడ ఉన్మాది ఆచూకి ఎక్కడా దొరకలేదు. దీంతో అక్కడ సైకో లేడని నిర్ధారించుకున్న పోలీసులు బత్తలవల్లం ఫారెస్టు నుండి వెనుదిరిగారు. జిఎంసి టోల్ గేటు వద్ద వాహనాలు ఎక్కడికి అక్కడ తనిఖీలు చేస్తున్నారు.
కాగా బత్తలవలం అటవీ ప్రాంతంలో ఓ అనుమానిత వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను ఉన్మాది కాదని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. అతనిని నెల్లూరు అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో తడ పోలీసు స్టేషన్కు తరలించారు.
కాగా భద్రాచలం నుండి చెన్నై వెళుతున్న ఆర్టీసి బస్సులో గురువారం వేకువజామున ఓ సైకో ముగ్గురి గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే. మరో వ్యక్తిని తీవ్రంగా గాయపర్చాడు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications