జెడి కాల్ డేటా: మోసపోయానని సిఐ కోర్టుకు మొర

ఇదే కేసులో తాజాగా వేటు పడిన బీఎస్ఎన్ఎల్ అధికారి హనుమంతరావు కూడా ముందస్తు బెయిల్ కోరారు. మరోవైపు అధికారులు కేసు దర్యాప్తులో వేగాన్ని పెంచారు. దీంతో నిందితులు అరెస్టుల నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కె. వెంకట్ రెడ్డి అరెస్టు, రిమాండ్ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తున్నందున ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ
కేసులో ఇప్పటికే అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న కేవీ రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ దర్యాప్తు అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది. నిందితులను పట్టుకోవడమే కాకుండా కేసు మూలాల్లోకి వెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేటు డిటెక్టివ్ ప్రమేయంపై ఆరా తీయనున్నారు.
ఇదిలా వుంటే, వాన్పిక్ ప్రాజెక్టులో లీజు గడువు ముగిశాక.. ఇండస్ట్రియల్ కారిడార్ తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం కాకుండా చేయడంలో ఐఆర్టీసీ అధికారి, అప్పటి పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని సీబీఐ ఆరోపించింది. రాయితీ ఒప్పందంపై ఆయన సంతకాలు చేయడం ద్వారా అది నిరూపితమైందని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని నాంపల్లి కోర్టును కోరింది. కాగా, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ప్రభుత్వానికి తెలిపినా, పట్టించుకోలేదని దాని వెనక ప్రత్యేక కారణా లున్నాయని సీబీఐ తాజాగా ఆరోపించింది. నిమ్మగడ్డ ఒత్తిడి వల్లే ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించిందని తెలిపింది.
మరో వైపు, గాలి బెయిల్ కేసులో నిందితుడు రవిచంద్ర బెయిల్ పిటిషన్ను ఎసిబి కోర్టు తోసిపుచ్చిం ది. ఈ పిటిషన్పై గురువారం కోర్టులో వాదనల సందర్భంగా రవిచంద్రకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిలివ్వొద్దని ఎసిబి గట్టిగా కోరింది. దీంతో ఏకీభవించిన న్యాయస్థానం నిందితుడికి బెయిల్ నిరాకరించింది. అయితే ఇదే కేసులో నిందితుడు, సస్పెండైన జడ్జి పట్టాభి రామారావు, రిటైర్డ్ జడ్జి చలపతిరావు, రవిచంద్ర జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 9 వరకు కోర్టు పొడిగించింది.
కాగా ఈ కేసులో మరో నిందితుడు దశరథరామిరెడ్డిని ఐదురోజుల కస్టడీకివ్వాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. గాలికి బెయిల్ కోసం న్యాయమూర్తులను కొనేందుకు రూ.100 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిన దశరథరామిరెడ్డి.. అంత మొత్తాన్ని ఎక్కడి నుంచి సేకరించాలనుకున్నారో, ఇప్పటికే ఖర్చుచేసిన సొమ్ము ఎవరు ఇచ్చారో తెలుసుకోవాల్సి ఉందని ఆ పిటిషన్లో ఏసీబీ పేర్కొన్నట్లు సమాచారం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications