విభజిస్తే కుక్కలు చింపిన విస్తరి: గాదె, రియాక్షనే... జెసి
ఎవరెన్ని చెప్పినా రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అన్నారు. ఒకరేమో ఉత్తరాంధ్ర, మరొకరేమే రాయలసీమ, మరొకరేమో తెలంగాణ, ఇంకొకరేమో హైదరాబాద్ అంటుంటారని ఇలా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకోవడం సరికాదని ఆయన చెప్పారు. రాయలసీమ నేతలు కూడా సమైక్యాంధ్రకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని, విభజిస్తేనే ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారన్నారు. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నివేదిక ఇచ్చిందన్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేసిన ప్రత్యేక రాయలసీమ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి స్పందించారు. కేంద్రానికి తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాయాలన్న తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతల యాక్షన్కు రియాక్షనే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యేక రాయలసీమ డిమాండ్ అన్నారు.
వర్షాలు పడని పక్షంలో మేఘమథనం చేయాలా వద్దా అని నిర్ణయించాల్సింది తమ పార్టీ అధిష్టానం అన్నారు. అయినా మేఘమథనం చేస్తే ఆ శాఖ మంత్రికి మాత్రమే లాభమని విమర్శలు గుప్పించారు. కాగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి శనివారం రాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సి వస్తే మూడుగా చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.