హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికల నిబంధనల ఉల్లంఘన: కోర్టుకు జయసుధ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayasudha
హైదరాబాద్: ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు విషయంలో సహజ నటి, సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ శనివారం ఎర్రమంజిల్ కోర్టుకు హాజరయ్యారు. 2009 ఎన్నికలలో ఆమె ఎన్నికల నిబంధనను ఉల్లంఘించిన కేసు నమైదయింది. ఈ కేసులో ఆమె ఇప్పటికే కోర్టులో హాజరయ్యారు. మరోసారి హాజరు కావాల్సి ఉంది. ఈ విషయమై జయసుధ కోర్టు హాజరైన అనంతరం స్పందించారు.

2009 సాధారణ ఎన్నికల సమయంలో తాను ఎన్నికల కోడ్ ఉల్లంఘించానని తనకు సమ్మన్లు వచ్చాయని చెప్పారు. అప్పుడు తన కాన్వాయ్‌లో నిబంధనలకు మించి వాహనాలు ఉన్నందునే సమ్మన్లు జారీ అయినట్లు చెప్పారు. తాను ప్రచారం నిర్వహించిన జీపు డ్రైవర్ పైన కూడా కేసు నమోదయిందని ఆమె చెప్పారు. తన తరఫు న్యాయవాది కోర్టుకు హాజరు కావాల్సిందిగా చెప్పడంతో తాను వచ్చానని తెలిపారు.

కాగా జయసుధ 2009 సాధారణ ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన ఆమె ఘన విజయం సాధించారు.

English summary
Actor - turned - politician and secunderabad MLA Jayasudha, on Saturday, appeared before the Erramanzil court for a case relating to election code violation in 2009.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X