ఎన్నికల నిబంధనల ఉల్లంఘన: కోర్టుకు జయసుధ
2009 సాధారణ ఎన్నికల సమయంలో తాను ఎన్నికల కోడ్ ఉల్లంఘించానని తనకు సమ్మన్లు వచ్చాయని చెప్పారు. అప్పుడు తన కాన్వాయ్లో నిబంధనలకు మించి వాహనాలు ఉన్నందునే సమ్మన్లు జారీ అయినట్లు చెప్పారు. తాను ప్రచారం నిర్వహించిన జీపు డ్రైవర్ పైన కూడా కేసు నమోదయిందని ఆమె చెప్పారు. తన తరఫు న్యాయవాది కోర్టుకు హాజరు కావాల్సిందిగా చెప్పడంతో తాను వచ్చానని తెలిపారు.
కాగా జయసుధ 2009 సాధారణ ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన ఆమె ఘన విజయం సాధించారు.
English summary
Actor - turned - politician and secunderabad MLA Jayasudha, on Saturday, appeared before the Erramanzil court for a case relating to election code violation in 2009.
Story first published: Sunday, July 29, 2012, 10:52 [IST]