కిరణ్ రెడ్డి లాబీయింగ్: జైపాల్ రెడ్డి మండిపాటు
ఇప్పుడు గ్యాస్ కొరత ఏర్పడడం వల్ల కేటాయంపు ప్రాధాన్యతను గుర్తించారనిన, ఇప్పుడు కూడా మన రాష్ట్రానికి తగిన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. నిరంతరం గ్యాస్ ఇవ్వడం వల్ల రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల లాభం చేకూరిందని ఆయన చెప్పారు. గ్యాస్ కొరతకు తనను మాత్రమే నిందించడం తగదని ఆయన అన్నారు. రత్నగిరి ప్లాంట్కు గ్యాస్ కేటాయింపులపై మంత్రులు సాధికారిక బృందమే తిరిగి సమీక్షించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కోసం ప్రధాని మన్మోహన్ సింగ్తో మాట్లాడుతానని ఆయన చెప్పారు.
గ్యాస్ కోసం లాబీయింగ్ చేయడం కోసం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి అదనపు గ్యాస్, విద్యుత్తు కేటాయించాలని ఆయన మొయిలీని కోరారు. ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు పార్లమెంటు సభ్యులు, మంత్రులు పాల్గొన్నారు.
గ్యాస్ కొరత అంశాన్ని ముఖ్యమంత్రి తమ దృష్టికి తీసుకుని వచ్చారని మొయిలీ భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. దీనిపై ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్తున్నారని ఆయన చెప్పారు.
సుశీల్ కుమార్ షిండే విద్యుచ్ఛక్తి మంత్రిగా పనిచేస్తున్నప్పుడు మహారాష్ట్రకు మేలు చేసేందుకు కెజి బేసిన్ గ్యాస్ను రత్నగిరి ప్లాంటుకు కేటాయించడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందనే విమర్సలు వస్తున్నాయి. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ కూడా రాశారు.