జగన్ రిమాండ్ 14 రోజులు పొడిగింపు, 28 వరకు
ఒఎంసి కేసులో బెంగళూరు జైలులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని, చంచల్గూడ జైలులో ఉన్న బివి శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. ఇదే కేసులో నిందితురాలు శ్రీలక్ష్మిని నేరుగా కోర్టులో హాజరుపరిచారు. ఎమ్మార్ కేసులో నిందితులు సునీల్రెడ్డి, విజయ రాఘవ, ఆచార్యను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణ చేసింది. మూడు కేసుల్లో నిందితులందరికీ కోర్టు 28 వరకు రిమాండ్ పొడిగించింది.
కాగా బెయిల్ మంజూరు చేయాలంటూ సీనియర్ ఐఏఎస్, ఎమ్మార్ కేసు నిందితుడు బిపి ఆచార్య దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణ 24వ తేదీకి వాయిదా పడింది. జగతి కేసులో నిందితుడు బ్రహ్మానంద రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణనూ అదే రోజుకు వాయిదా వేశారు.
మరోవైపు ఒఎంసి, జగతి కేసుల్లో నిందితులపై నమోదు చేసిన అభియోగాల తాలూకా పత్రాలను, ఇతర డాక్యుమెంట్లను సిబిఐ తమకు నేటికీ ఇవ్వలేదని డిఫెన్స్ న్యాయవాది అశోక్ రెడ్డి సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జికి ఫిర్యాదు చేశారు. వాటి గురించి తాము ఇప్ప టికే రెండుసార్లు కోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చామని తెలిపారు. శనివారం లోగా ఆ కాపీలను అందజేయాలంటూ జడ్జి ఆదేశించారు.