నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీవోల పాపమంతా జగన్‌దే, మంత్రులేమో బలి: పితాని

By Pratap
|
Google Oneindia TeluguNews

Pitani Satyanarayana
నెల్లూరు: మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డే కారణమని రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. జగన్ అవినీతికి అమాయకులు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ మండలంలోని పెద్దచెరుకూరు గ్రామంలో ఆయన ఆదివారం పర్యటించారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. జగన్ చేసిన పాపాలవల్లే కొందరు ఐఏఎస్ అధికారులు నేడు జైలు జీవితం గడుపుతున్నారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోల తయారీలో అక్రమాలు సృష్టించింది జగనేనని మంత్రి ఆరోపించారు. కేబినెట్ జారీచేసే జీవోలను తనకు అనుకూలంగా మలచుకుని వాటి ద్వారా ఆర్థిక లబ్ధి పొందింది కూడా జగనేనని వివరించారు.

కాంగ్రెస్‌వాదిగా పుట్టిన వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వ్యక్తిగానే మరణించాడని పితాని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆయన ఫొటో పెట్టుకుని రంగులు మార్చేసి మసిపూసి మారేడుకాయ చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

English summary
Minister Pitani Satyanarayana accused YSR Congress president YS Jagan for the release of GOs in YS Rajasekhar Reddy's regime. He said ministers are innocent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X