టెక్కీ ఫ్లాట్ నుంచి దూకిన బాల కార్మికురాలు

సాఫ్ట్వేర్ ఇంజనీర్ భుజంగరావు తన కేంద్రీయ విద్యాలయలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన భార్యతో ప్రగతినగర్లోని శ్రీరవి రెసెడన్సీలోని రెండో అంతస్థు ఫ్లాట్లో ఉంటున్నాడు. ఇంటి పనుల కోసం ఏడాదిన్నర క్రితం వారు తెచ్చుకున్నారు. బాలికను ఇంట్లో ఉంచి తాళం వేసి శనివారం రాత్రి దంపతులు బయటకు వెళ్లారు.
శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ బాలిక పారిపోయే ఉద్దేశంతో భవనం రెండో అంతస్థుపై నుంచి కిందికి దూకింది. వాచ్మన్ శబ్దం విని కింద పడి ఉన్న బాలికను చూశాడు. వెంటనే తన గదిలోకి తీసుకుని వెళ్లి ఇతర ఫ్లాట్లలో ఉన్నవారిని లేపాడు. బాలిక కాళ్లకు, చేతులకు గాయాలు తగిలాయి.
బాలిక వాంగ్మూలాన్ని, ఇతర ఫ్లాట్ యజమానుల వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు. ఆ బాలిక మహబూబ్నగర్ జిల్లా హసన్పల్లి గ్రామానికి చెందినట్లు పోలీసులు గుర్తించారు. దినసరి కార్మికుల కూతురు ఆమె.












Click it and Unblock the Notifications