రూ. 35 వేలే ఫీజు చెల్లిస్తాం: పితాని సత్యనారాయణ

బోధనా ఫీజు చెల్లింపుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసిన అనంతరం మంగళవారం సాయంత్రం మంత్రి పితాని మీడియాతో మాట్లాడారు. రూ. 35 వేల ఫీజును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బోధనా ఫీజు రూ. 35 వేలకు మించితే విద్యార్థులే భరించాలని తేల్చిచెప్పారు. 2012-13 బోధనా ఫీజుకు సంబంధించి పలు అంశాలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించామని తెలిపారు.
67 కళాశాలల్లో టాస్క్ఫోర్స్ తనిఖీల తర్వాత ఫీజు తగ్గే అవకాశం ఉందన్నారు. రూ. 35 వేల ఫీజును 578 కళాశాలలు అంగీకరించాయని చెప్పారు. మెరిట్ విద్యార్థుల విషయంలో బోధనా ఫీజు చెల్లింపునకు సంబంధించి సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ఫీజు ఎందుకు చెల్లించాలని మంత్రి ప్రశ్నించారు.
మెరిట్ విద్యార్థులకు ఫీజు చెల్లించే విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కటాఫ్ మార్కులు నిర్ణయించి, ఆ మార్కులు దాటిన విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు చెల్లింపులో వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లించాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !!












Click it and Unblock the Notifications