హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులపై విహెచ్ ధ్వజం: అవకాశవాదులని వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
హైదరాబాద్: మంత్రులపై కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ధ్వజమెత్తారు. పార్టీలో అవకాశవాదులున్నారని ఆయన విమర్శించారు. యూత్ కాంగ్రెసు మాజీ అధ్యక్షులతో ఆయన శనివారం కాంగ్రెసును రక్షించు, కాంగ్రెసును బలపరుచు అనే పేరుతో మేథోమథనం నిర్వహించారు. ప్రజలకు పార్టీకి దూరమవుతున్నా పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కార్యకర్తలను మంత్రులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

పార్టీ కార్యకర్తల నుంచి సూచనలను స్వీకరించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు నివేదిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసును బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, పదవులపై తమకు ఆశ లేదని ఆయన అన్నారు. మంత్రివర్గం ఉటుంది గానీ నామినేటెడ్ పోస్టులు ఉండవా అని ఆయన అడిగారు.

ఎందుకు ఓడిపోతున్నామనే విషయంపై పార్టీపరంగా చర్చ జరగాలని తాను సూచించినా పిసిసి పట్టించుకోకపోవడంతో తానే చొరవ చూపి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కూడా ఆహ్వానించారు. కానీ వారు రాలేదు. 1972 నుంచి యూత్ కాంగ్రెసు అధ్యక్షులుగా పనిచేసినవారిని ఈ సదస్సుకు విహెచ్ ఆహ్వానించారు.

తెలంగాణ అంశాన్ని తేల్చకపోతే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఎదుర్కోకపోతే కాంగ్రెసుకు గడ్డుకాలమేనని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. అవినీతి ఆరోపణలతో యుపిఎ ఇబ్బందుల్లో ఉందని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసు గెలవడం కష్టమేనని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో, సీమాంధ్రలో జగన్ ప్రభంజనంతో కుదేలైన కాంగ్రెసును మళ్లీ గాడిలో పెట్టేందుకు యువ కాంగ్రెసు నేతలు ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు.

English summary
Congress senior leader and Rajyasabha member V Hanumanth Rao lashed out at ministers. He said that party leaders are ignoring workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X