వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు వేరని..: కెవిపి డైరీ ఆవిష్కరణపై అంబటి కామెంట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
గుంటూరు: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని, ఆయన తనయుడు, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వేరు చేసి చూపించి ప్రయోజనం పొందారని కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శనివారం గుంటూరు జిల్లాలో మండిపడ్డారు. వైయస్‌ను పొగిడి ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

వైయస్ పాదయాత్ర డైరీ ఆవిష్కరణపేరిట ఢిల్లీలో కాంగ్రెసు నేతలు చేసిన హడావుడి ప్రజలను మభ్యపెట్టేందుకేనన్నారు. వైయస్ పేరును జగన్ ఆస్తుల కేసులలో సిబిఐ ఎఫ్ఐఆర్‌లో చేర్చి, క్రిమినల్‌గా చిత్రీకరించినప్పుడు ఆ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెసును రెండుసార్లు అధికారంలోకి తీసుకు వచ్చిన వైయస్‌ కుటుంబాన్ని కాంగ్రెసు పెద్దలు వేధిస్తున్నారని ఆరోపించారు.

ప్రజాధరణ కలిగిన వైయస్ తనయుడు జగన్‌ను జైలుకు పంపినప్పుడు ఈ నేతలు ఏమయ్యారన్నారు. వైయస్ కుటుంబాన్ని క్షోభకు గురి చేస్తున్న ఈ నేతలకు వైయస్‌ను తమవాడని చెప్పుకునే నైతిక హక్కు లేదన్నారు. త్వరలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులు విలీనమవుతాయన్న వదంతులపై అంబటి స్పందిస్తూ ప్రజలు ఇలాంటి వాటిని నమ్మరన్నారు. ఇవన్నీ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా అవతరించిన తమ పార్టీని, జగన్ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేందుకే అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఇంకా అధికారదాహం తీరలేదని, పాదయాత్రలు, సైకిల్ షోలు వంటి జిమ్మిక్కులతో ఆయనకు అధికారం దక్కడం కల్ల అన్నారు. పాదయాత్ర చేసిన అందరూ ముఖ్యమంత్రి కూర్చీలో కూర్చోలేరని ఎద్దేవా చేశారు. ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిన బాబు, ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతున్నారని అన్నారు.

English summary

 YSR Congress party spokes person Ambati Rambabu said on Saturday in Guntur district that Congress is trying to show late YS and YS Jagan are different.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X