బాబు, జగన్, కెసిఆర్ బయటకెళ్లిన వారే: తులసి రెడ్డి

అలాగైతేనే వారిని తమ పార్టీలో విలీనం చేసుకుంటామని చెప్పారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఒక్కటవుతాయని చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై తులసి రెడ్డి స్పందించారు. కడప జిల్లాలోని వేంపల్లెలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, కెసిఆర్ లేదా జగన్ తమ తమ పార్టీలోన కాంగ్రెసులో విలీనం చేయాలనుకుంటే అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు.
వారు ఎందుకు విలీనం చేస్తున్నారో తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరముంటుందన్నారు. కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు విలీనంపై వారే చెప్పాలన్నారు. టిఆర్ఎస్, జగన్ పార్టీలను జేబులో పెట్టుకొని కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రకటించడం హాస్యాస్పదమని అన్నారు.












Click it and Unblock the Notifications