తెలంగాణ: సదస్సు వద్దన్న టి-ఎంపీలు, బొత్స ససేమీరా

తెలంగాణ సదస్సు వేరుగా పెట్టాలని తాము కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్కు లేఖ కూడా రాస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన అనివార్యంగా కనిపిస్తున్న ఇలాంటి సమయంలో సదస్సు ఒకటిగా కాకుండా సీమాంధ్ర, తెలంగాణలకు వేర్వేరుగా నిర్వహించాలని సూచించారు. ఇరు ప్రాంతాలకు కలిపి సదస్సులు పెడితే ఇబ్బందులు వచ్చే అవకాశముందన్నారు. ఈ సదస్సు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఎంపీలు అభిప్రాయపడ్డారు.
సదస్సు విషయమై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోమవారం గాంధీ భవనంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను కలిసి చర్చించారు. వేర్వేరు సదస్సులు నిర్వహించాలని ఆయన బొత్సను కోరారు. అయితే బొత్స మాత్రం అందుకు ససేమీరా అన్నట్లుగా తెలుస్తోంది. సదస్సులు వేర్వేరుగా నిర్వహించేది లేదని, అవసరమైతే రాష్ట్ర సదస్సు నిర్వహించిన తర్వాత వేర్వేరుగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని కోమటిరెడ్డితో బొత్స చెప్పారు. ఈ విషయమై ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం కూడా జరిగింది.
కాగా పార్టీ బలోపేతం కోసమంటూ కాంగ్రెసు ఈ నెల 23న రాష్ట్ర సదస్సును నిర్వహించేందుకు సిద్ధమైంది. తెలంగాణ నేతలు వేర్వేరు సదస్సులకు పట్టుబడుతున్న నేపథ్యంలో సదస్సు ఈ నెల 30వ తేదికి లేదా అక్టోబర్ మొదటి వారానికి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications