గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రమశిక్షణఉంది: విభజనపై శైలజానాథ్, జెఏసి వార్నింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sailajanath
హైదరాబాద్/గుంటూరు: తెలంగాణ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని తాము తమ పార్టీ అధిష్టానాన్ని కోరుతామని మంత్రి శైలజానాథ్ ఆదివారం చెప్పారు. ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివ రావులతో కలిసి సీమాంధ్ర నేతలు అందరం అధిష్టానాన్ని కలుస్తామని చెప్పారు.

తెలంగాణ సమస్యను సాధ్యమైనంత త్వరగా తేల్చాలన్నారు. మరికొందరు నేతలు ఢిల్లీకి రేపు వస్తున్నట్టు శైలజానాథ్ చెప్పారు. రాష్ట్ర విభజననా, సమైక్యాంధ్రనా అనే విషయాన్ని పార్టీ అధిష్టానం వెంటనే తీసుకోవాలన్నారు. తాము క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలమని, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తామని చెప్పారు. శైలజానాథ్ ఢిల్లీ బయలుదేరే ముందు కావూరిని కలిశారు.

రాజీనామాకు సిద్ధం కండి.. శామ్యూల్

సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడాలని సమైక్యాంధ్ర రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ శ్యామ్యూల్ గుంటూరులో డిమాండ్ చేశారు. రేపటి నుండి సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. తెలంగాణకు మద్దతిచ్చే నేతలను తాము సీమాంధ్రలో తిరగనివ్వమని హెచ్చరించారు.

English summary

 Minister Sailajanath went to New Delhi on Sunday to talk about Telangana issue with Congress party Delhi leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X