పోటీ చేస్తా, జగన్‌కు ఓటు బాధ కలిగించింది: నటి కవిత

Kavitha
మహబూబ్‌నగర్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిండుకుండ వంటి వాడని తెలుగు మహిళా రాష్ట్ర నేత, ప్రముఖ సినీనటి కవిత అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు సేవా గుణాన్ని చూసే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అవినీతిలో కూరుకుపోయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని ఆరోపించారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆశీస్సులతో ఎన్నికల్లో పోటీ చేస్తానని కవిత వెల్లడించారు.

బాపూజీకి చంద్రబాబు నివాళి

చేనేత పరిశ్రమకు గుర్తింపు తెచ్చేందుకు కొండా లక్ష్మణ్ బాపూజీ ఎనలేని కృషి చేశారని నారా చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన టిడిపి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం చివరి రోజైన మంగళవారంనాడు బాపూజీకి ఆయన నివాళులర్పించారు. తుది శ్వాస విడిచే వరకు తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని అన్నారు. బాపూజీ లేని లోటు పూడ్చలేనిదన్నారు. బాపూజీ కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+