ఆపరేషన్ కోసం బెయిలివ్వండి, అసలుకే ఎసరు: శ్రీలక్ష్మి

సిబిఐ న్యాయవాది తన వాదనలు కొనసాగిస్తూ.. దర్యాప్తు కీలక దశలో ఉన్న ఈ తరుణంలో ఆమెకు బెయిల్ ఇవ్వవద్దని కోరారు. వెన్నునొప్పి చికిత్స చాలా కీలకమైందని, చాలా జాగ్రత్తగా చేయాలని, మానవ తప్పిదం జరిగితే అసలుకే ఎసరు వస్తుందని డిఫెన్స్ న్యాయవాది సురేంద్ర రావు కోర్టుకు చెప్పారు. వెన్నునాడులకు ఇబ్బంది లేకుండా చికిత్స చేయించే ఉద్దేశంతో ఫిజియోథెరపీపై సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు.
లేదంటే రోబోటిక్ పరిజ్ఞానంతో సర్జరీ చేయించాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. నిమ్స్(నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో అటువంటి పరిజ్ఞానం అందుబాటులో లేదని, కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లేందుకు అనుమతించాలని కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు పూర్తి కావడంతో తీర్పును జడ్జి ఈ నెల 8వ తేదికి వాయిదా వేశారు.
కాగా శ్రీలక్ష్మి తీవ్ర అస్వస్థతతో కొంతకాలంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్లో ఆమెనే స్వయంగా ఆ విషయం చెప్పారు. నడవలేని స్థితిలో ఉన్నానని ఆమె కోర్టుకు చెప్పుకున్నారు. 'నాకు వెన్నునొప్పి తీవ్రంగా ఉంది. వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. అందుకోసమైనా బెయిల్ మంజూరు చేయండి' అని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నెల 24, 29వ తేదీల్లో నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రులకు వెళ్లినపుడు వెన్నునొప్పికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఓఎంసీ కేసులో తనను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.. బెయిల్ పిటిషన్పై 3న కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సిబిఐకి సూచించి, కేసు ను అదే రోజుకు వాయిదా వేశారు. తోడు లేకుండా నడవలేక పోతున్నానని శ్రీలక్ష్మి తన బెయిల్ పిటిషన్లో చెప్పుకున్నారు. అత్వసరంగా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారని, చికిత్స చేయకపోతే ఎడమ పాదం స్పర్శ కోల్పోయే ప్రమాదం ఉందని వారన్నారని ఆమె అన్నారు.
రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమని కూడా వైద్యులు చెప్పినట్లు ఆమె తెలిపారు. కోర్టుకు ఆమె వైద్యులు ఇచ్చిన నివేదికలను కూడా సమర్పించారు. గత నెల 24, 27 తేదీల్లో శ్రీలక్ష్మిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు పరీక్షించారు. ఆ తర్వాత నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో కూడా ఆమెకు పరీక్షలు చేశారు. ఆమెకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. మానసికంగా కూడా శ్రీలక్ష్మి కుంగిపోయినట్లు చెబుతున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications