Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆపరేషన్ కోసం బెయిలివ్వండి, అసలుకే ఎసరు: శ్రీలక్ష్మి

Srilaxmi
హైదరాబాద్: రోబోటిక్ పరిజ్ఞానంతో వెన్నునొప్పికి ఆపరేషన్ చేయించుకోవాలని కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితురాలు శ్రీలక్ష్మి కోర్టుకు తెలిపారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నాంపల్లి సిబిఐ కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. ఆపరేషన్ అవసరమైతే అందుకు సంబంధించిన ఎమ్మారై స్కాన్ రిపోర్టు ఇవ్వలేదని సిబిఐ న్యాయవాది చెప్పగా, అవన్నీ అందిస్తామని డిఫెన్స్ న్యాయవాది బదులిచ్చారు.

సిబిఐ న్యాయవాది తన వాదనలు కొనసాగిస్తూ.. దర్యాప్తు కీలక దశలో ఉన్న ఈ తరుణంలో ఆమెకు బెయిల్ ఇవ్వవద్దని కోరారు. వెన్నునొప్పి చికిత్స చాలా కీలకమైందని, చాలా జాగ్రత్తగా చేయాలని, మానవ తప్పిదం జరిగితే అసలుకే ఎసరు వస్తుందని డిఫెన్స్ న్యాయవాది సురేంద్ర రావు కోర్టుకు చెప్పారు. వెన్నునాడులకు ఇబ్బంది లేకుండా చికిత్స చేయించే ఉద్దేశంతో ఫిజియోథెరపీపై సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు.

లేదంటే రోబోటిక్ పరిజ్ఞానంతో సర్జరీ చేయించాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. నిమ్స్‌(నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో అటువంటి పరిజ్ఞానం అందుబాటులో లేదని, కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లేందుకు అనుమతించాలని కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు పూర్తి కావడంతో తీర్పును జడ్జి ఈ నెల 8వ తేదికి వాయిదా వేశారు.

కాగా శ్రీలక్ష్మి తీవ్ర అస్వస్థతతో కొంతకాలంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌లో ఆమెనే స్వయంగా ఆ విషయం చెప్పారు. నడవలేని స్థితిలో ఉన్నానని ఆమె కోర్టుకు చెప్పుకున్నారు. 'నాకు వెన్నునొప్పి తీవ్రంగా ఉంది. వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. అందుకోసమైనా బెయిల్ మంజూరు చేయండి' అని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నెల 24, 29వ తేదీల్లో నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రులకు వెళ్లినపుడు వెన్నునొప్పికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఓఎంసీ కేసులో తనను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.. బెయిల్ పిటిషన్‌పై 3న కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సిబిఐకి సూచించి, కేసు ను అదే రోజుకు వాయిదా వేశారు. తోడు లేకుండా నడవలేక పోతున్నానని శ్రీలక్ష్మి తన బెయిల్ పిటిషన్‌లో చెప్పుకున్నారు. అత్వసరంగా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారని, చికిత్స చేయకపోతే ఎడమ పాదం స్పర్శ కోల్పోయే ప్రమాదం ఉందని వారన్నారని ఆమె అన్నారు.

రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమని కూడా వైద్యులు చెప్పినట్లు ఆమె తెలిపారు. కోర్టుకు ఆమె వైద్యులు ఇచ్చిన నివేదికలను కూడా సమర్పించారు. గత నెల 24, 27 తేదీల్లో శ్రీలక్ష్మిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు పరీక్షించారు. ఆ తర్వాత నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో కూడా ఆమెకు పరీక్షలు చేశారు. ఆమెకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. మానసికంగా కూడా శ్రీలక్ష్మి కుంగిపోయినట్లు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+