గాలి కేసులో ఎమ్మెల్యే సురేష్కు బెయిల్, అలీకి కస్టడీ
ఓఎంసి కేసులో అలీఖాన్కు జ్యూడిషియల్ కస్టడీ
ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్లో గాలి జనార్ధన్ రెడ్డి పిఏ అలీఖాన్కు సిబిఐ కోర్టు ఈ నెల 17 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఓఎంసి అక్రమ తవ్వకాల కేసులో సహ నిందితుడు అలీఖాన్ను ఉదయం నాంపల్లి సిబిఐ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. అసోసియేట్ మైనింగ్ కంపెనీ గనుల తవ్వకాల కేసులో బెంగళూరు సిబిఐ కోర్టులో లొంగిపోయిన ఆయనను ట్రాన్సిట్ వారెంటుపై హైదరాబాద్ నిన్న రాత్రి తరలించారు.
ఓఎంసి కేసులో గాలితో పాటు సహ నిందితుడిగా ఉన్న ఆయన గత ఏడాది గాలి అరెస్టు సమయంలో పరారై నాలుగు నెలల క్రితం సిబిఐ కోర్టులో లొంగిపోయాడు. సిబిఐ సోదాల్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్లోని సమాచారాన్ని రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం అలీఖాన్ చేత తెరిపించి అక్రమ తవ్వకాల వివరాలను తెలుసుకోనుంది. ఇందుకు అలీఖాన్ కస్టడీ కోసం సిబిఐ పిటిషన్ దాఖలు చేయనుంది.