అభిమానుల పూలతో బాబు కళ్లకు ఇన్ఫెక్షన్, ఆలస్యం

ఈ సందర్భంగా చంద్రబాబుపై బంతిపూలు, ఇతర పూలు జల్లుతున్నారు. ఇవి కళ్లలో పడటంతో ఆయన కళ్ళు ఇన్ఫెక్షన్కు గురయ్యాయి. గురువారం ఉదయం వైద్యులు ఆయనను పరీక్షించి ఎక్కవ సేపు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో చంద్రబాబు ఈ రోజు పదకొండు గంటల వరకు రెస్టు తీసుకొని ఆ తర్వాత తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ రోజుతో చంద్రబాబు యాత్ర పదోరోజుకు చేరుకుంది.
బాబు పాదయాత్ర ఈ రోజు ఉదయం ధనేకుల మండలం పెనకలపాడు గ్రామంలో ఉదయం 10.55 నిమిషాలకు ప్రారంభమైంది. ఆయన గ్రామానికి చేరుకోగానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు వివిధ సమస్యలు బాబు ముందు పెట్టారు. ఈ పాదయాత్రకు చిత్తూరు జిల్లా పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలిత్ కుమార్ హాజరై మద్దతు పలికారు.
షోళ్లపురం, హనుమాపురం మీదుగా బాబు యాత్ర సాగుతుంది. చంద్రబాబు వెంట శాసనమండలి సభ్యుడు మెట్టి గోవింద రెడ్డి, ఇంచార్జి దీపక్ రెడ్డి తదితరులు ఉన్నారు. కళ్ల ఇన్ఫెక్షన్ కారణంగా రాత్రి కూడా చంద్రబాబు పాదయాత్ర కాస్త ముందుగానే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబు పైన ఎవరూ పూలు చల్లవద్దని, కాస్త పక్కకు చల్లాలని నేతలు కోరుతున్నప్పటికీ అభిమానులు ఆగలేక పోతున్నారు.












Click it and Unblock the Notifications