హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిల పాదయాత్ర 2,500 కాదు 3వేల కిలోమీటర్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 2,500 కిలోమీటర్లుగా మొదట పార్టీలో చర్చకు వచ్చినప్పటికీ ఇప్పుడు మూడువేల కిలోమీటర్ల మేర చేయాలని పార్టీ నేతలు దాదాపు నిర్ణయించినట్లుగా సమాచారం. ఇందుకు షర్మిల కూడా అంగీకారం తెలిపారని చెబుతున్నారు. అయితే గురువారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై దీనిని చర్చించి ఆ తర్వాత అధికారికంగా ప్రకటించనుంది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో దానికి కౌంటర్‌గా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా షర్మిలతో పాదయాత్ర చేయించాలనే నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్రనా, రథయాత్రనా లేక ఓదార్పు యాత్రనా అనే అంశంపై పార్టీలో తర్జన భర్జన ప్రారంభమైంది. మెజార్టీ సభ్యులు పాదయాత్రకే మొగ్గుచూపారు.

పార్టీ నేతలు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యాత్ర ఏవిధంగా ఉండాలో గురువారం నిర్ణయిస్తామని చెప్పారు. అలా చెప్పినప్పటికీ పాదయాత్రనే ఖరారైనట్లుగా సమాచారం. ఈ పాదయాత్రకు అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయనతో చర్చించాకే షర్మిలతో యాత్ర చేయించేందుకు పార్టీ సిద్ధమైంది.

అలాగే ఈ పాదయాత్రను ఈ నెల 17 నుండి ప్రారంభించాలని తొలుత భావించినప్పటికీ 18 నుండి ప్రారంభించాలని తాజాగా నిర్ణయించినట్లుగా సమాచారం. ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర సాగనుంది. కడప, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల మీదుగా షర్మిల పాదయాత్ర సాగనుంది. అయితే అన్ని విషయాలను వైయస్సార్ కాంగ్రెసు మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించనుంది.

English summary
YSR Congress party president YS Jaganmohan Reddy's sister Sharmila is ready to do 3,000 kilo meters padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X