హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ఎప్పుడైనా చెప్పారా, మీడియా కీలకం: వినోద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vinod Kumar
హైదరాబాద్: కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండేను తాను కలిశానని తమ పార్టీ అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎప్పుడైనా చెప్పారా అని తెలంగాణ రాష్ట్ర సమితి పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ గురువారం అన్నారు. సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలపై వినోద్ కుమార్ తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు.

షిండే వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. తాను షిండేను కలిసినట్లు కెసిఆర్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. షిండే వ్యాఖ్యలను తీసుకొని కెసిఆర్ చెప్పింది అబద్దం అన్నట్లుగా సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు కాంగ్రెసు పార్టీ పెద్దలతో చర్చలు జరగలేదన్నట్లుగా మీడియా ప్రచారం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ గురించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆయన మీడియాకు సూచించారు.

ప్రజాస్వామ్యంలో మీడియాది ప్రత్యేక బాధ్యత అన్నారు. ఉద్యమ స్వరూపాన్ని ప్రజలకు చేర్చడంలో మీడియాదే గొప్ప పాత్ర అన్నారు. కెసిఆర్ ఢిల్లీ నేతలతో చర్చలు జరపలేదని చెప్పడం దుర్మార్గమైన ప్రచారమన్నారు. రాజకీయ పార్టీలు తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటేనే కేంద్రంలో కదలిక ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణపై తమ అభిప్రాయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు.

English summary
Telangana Rastra Samithi former MP Vinod Kumar gave clarification on central minister Sushil Kumar Shinde on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X