హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పట్లో కాదు, ఎప్పుడో చెప్పలేం: తెలంగాణపై ఆజాద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
హైదరాబాద్: తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని, నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన విషయం కాదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆయన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ చాలా జఠిలమైన విషయమని ఆయన అన్నారు.

తెలంగాణపై తాను ఆనేకసార్లు చెప్పానని అంటూనే ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాము తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతోనే కాదు, అందరితోనూ చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఢిల్లీకి ఎవరు వచ్చినా మాట్లాడుతామని ఆయన అన్నారు. మంత్రులు, శానససభ్యులతో మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

తెలంగాణపై రెండేళ్ల నుంచి చర్చలు జరుపుతున్నామని ఆజాద్ చెప్పారు. తెలంగాణపై ఏకాభిప్రాయం అవసరమని, ఏకాభిప్రాయ సాధన వచ్చే వరకు తెలంగాణపై నిర్ణయం సాధ్యం కాదని, ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన అన్నారు. ఎంపి, బీహార్, యుపి విభజన మాదిరిగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి వీలు కాదని అన్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రజాప్రతినిధులతో, ప్రజలతో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఎవరికి వారు వాదనలు వినిపిస్తున్నారు గానీ ఏకాభిప్రాయం రావడం లేదని ఆయన అన్నారు.

తెలంగాణపై మాట్లాడుతుండగా ఆజాద్ పక్కన తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉన్నారు. వ్యాధులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. డెంగీ వ్యాధిపై ప్రభుత్వాధికారుతో సమీక్ష జరిపినట్లు ఆయన తెలిపారు.

English summary
Congress Andhra Pradesh affairs incharge and union health minister Ghulam Nabi Azad said that it is not easy to take decision on Telangana issue. He said that talks on Telangana are going on since two years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X