కన్నడ నటి హేమశ్రీ హత్య కేసు: రాష్ట్ర మంత్రి పాత్ర?

హేమశ్రీ మృతి కేసును దర్యాప్తు చేయకుండా ఆదేశాలు జారీ చేసినవారెవరని ఆయన అడిగారు. రాష్ట్ర హోం మంత్రిగా సబితా ఇంద్రా రెడ్డి ఇంకా కొనసాగడంలో అర్థం లేదని ఆయన అన్నారు. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా సబితా ఇంద్రా రెడ్డి రాజీనామా చేయాలని అన్నారు. హేమశ్రీ మృతికి బాధ్యుడైన మంత్రికి మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదని వర్ల రామయ్య అన్నారు.
ఇదిలావుంటే, హేమశ్రీ భర్త సురేంద్ర బాబుకు సహాయం చేసిన కారు డ్రైవర్ సతీష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సతీష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని తెలుస్తోంది. హత్యా నేరంపై పోలీసుల అదుపులో ఉన్న హేమశ్రీ భర్త విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది.
సురేంద్రబాబు సహకరించని నేపథ్యంలో కారు డ్రైవర్ సతీష్ పట్టుబడితే వాస్తవాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. హేమశ్రీ హత్యకు సంబంధించిన విచారణను పోలీసులు దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కోర్టులో దాఖలు చేయడానికి చార్జిషీట్ను రూపొందిస్తున్నట్లు సమాచారం. కర్నాటకకు చెందిన ప్రముఖ టివి నటి హేమశ్రీ(30) అనుమానాస్పద స్థితిలో అక్టోబర్ 9వ తేదీ రాత్రి మరణించిన విషయం తెలిసిందే.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications