హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు మైసూరా దూరమయ్యారా: రివర్స్ అయిందా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-Mysoora Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేత మాజీ పార్లమెంటు సభ్యుడు మైసూరా రెడ్డి దూరమయ్యారా అంటే కావొచ్చుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన పలు కార్యక్రమాల్లో ఇటీవల మైసూరా రెడ్డి పాల్గొనటం లేదని చెబుతున్నారు. మైసూరా రెడ్డి కొద్ది కాలం క్రితమే జగన్ పార్టీలో చేరారు.

కాంగ్రెసు పార్టీలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో విభేదించిన మైసూరా ఆ తర్వాత టిడిపిలో చేరారు. జగన్ అరెస్టు సమయంలో ఆయన ఆయన కుటుంబాన్ని కలుసుకున్నారు. అంతకుముందు నుండే ఆయన జగన్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. చంద్రబాబు మరోసారి తనకు మరోసారి రాజ్యసభ సభ్యత్వాన్ని కేటాయించక పోవడంతో ఆయన జగన్ వైపుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే విజయమ్మను కలవడంతో పార్టీయే మొదట అతనిపై వేటు వేసింది.

ఆయన అనుభవం, ఆ కుటుంబంతో ఉన్న సంబంధాల రీత్యా జగన్ పార్టీలో ఆయనదే హవా ఉంటుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే ప్రారంభంలో ఆయన హవా కొనసాగింది. అయితే క్రమంగా ఆయన ప్రాతినిధ్యం పార్టీలో తగ్గిందని చెబుతున్నారు. జగన్ అరెస్టు కావడంతో పార్టీలో చక్రం తిప్పేది తానే అని మైసూరా భావించారట. కానీ తీరా చూస్తే కథ అడ్డం తిరిగిందని చెబుతున్నారు. ఆయన ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

పార్టీ నిర్వహించే కార్యక్రమాలు కూడా ఆయనకు తెలియకుండానే జరుగుతున్నాయని అంటున్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో జగన్‌కు చుక్కెదురు అయినప్పుడు పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఢిల్లీ వెళ్లక ముందు ఆయన దానిని వ్యతిరేకించారని సమాచారం. అయితే వారు ఢిల్లీ వెళ్లి వచ్చే వరకు ఆయనకు తెలియదట. ఢిల్లీ వెళ్లొచ్చిన విషయం మీడియా చెబితేనే తెలిసిందట. జగన్ బెయిల్ పిటిషన్ అంశంపై మైసూరా ఓసారి నోరు కూడా జారారట. దాని ప్రభావమే ఆయనపై పడిందని చెబుతున్నారు.

తాను పార్టీలో చేరాక అంతా తానే నడిపించవచ్చునని భావించిన మైసూరా రెడ్డికి ఇప్పుడు ఆ పార్టీలో కరువు ఏర్పడిందని అంటున్నారు. ఆయనను పట్టించుకునే వారే లేరట. సీన్ రివర్స్ కావడంతో ఇప్పుడు మైసూరా రెడ్డి ఏం చేస్తారో చూడాలని అంటున్నారు. మైసూరా తీరుపై పార్టీలో అసంతృప్తి వ్యక్తం కావడం, దీంతో అతను పార్టీకి దూరం కావడం ఆయన వర్గం జీర్ణించుకోలేక పోతుందని చెబుతున్నారు.

English summary
It is said that former MP and YSR Congress party senior leader Mysoora Reddy is differed with party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X