హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.1 నుండి రూ.2కు పెరిగిన పొన్నాల జీతం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
హైదరాబాద్: తాను ఒక రూపాయి జీతానికి పని చేశానని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బుధవారం చెప్పారు. హైదరాబాదులోని గండిపేటలో ఉన్న చైతన్య భారతి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో ఉన్న అతిపెద్ద గ్రంథాలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా ఆయన తన గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నాడు.

నాటి తన ఉద్యోగ విషయాలను విలేకరులతో పంచుకున్నారు. నాడు తమ గ్రామంలో ఇరవై ఐదు మంది యవకులు కలసి దిన పత్రికలను తెప్పించుకొని సొంతంగా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. దాని బాధ్యతలను తనకు అప్పగించారని, రోజూ పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత లైబ్రరీని తానే నిర్వహించేవాడినని చెప్పారు.

నెలకు రూపాయి జీతం ఇచ్చే వారని, రెండు నెలలు బాగా చేసే సరికి.. తన జీతాన్ని రెండు రూపాయలకు పెంచారని పొన్నాల తెలిపారు. ఇది 1954వ సంవత్సరంలో తన స్వగ్రామంలో పొన్నాల లక్ష్మయ్య గ్రంథ పాలకుడు (లైబ్రేరియన్)గా ఉద్యోగం చేసినప్పటి జ్ఞాపకం.

English summary
IT Minister Ponnala Laxmaiah took Rs.1 salary in 1954 as Librarian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X