హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దసరాకు 24 గంటలే: తెలంగాణపై కెసిఆర్‌కి మోత్కుపల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothkupalli Narasimhulu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదిగో తెలంగాణ వస్తుంది.. ఇదిగో తెలంగాణ వస్తుందని కెసిఆర్ ఇప్పటికవ వందసార్లు చెప్పారన్నారు. కొద్ది రోజుల క్రితం మూడు నెలల్లో తెలంగాణ వస్తుందని చెప్పారని, ఇటీవల దసరాలోపు తెలంగాణ వస్తుందని చెప్పారని గుర్తు చేశారు.

ఆయన చెప్పిన దసరా పండుగకు మరో ఇరవై నాలుగు గంటలే గడువు ఉందని, కేంద్రం తెలంగాణ దసరాలోపు ఇస్తుందా చెప్పాలని ప్రశ్నించారు. కెసిఆర్ సెంటిమెంటును ఉపయోగించుకొని తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారన్నారు. కెసిఆర్ ఢిల్లీలో నెల రోజులు ఉండి ఏం చేశారన్నారు. కాంగ్రెసు పెద్దలతో జరిపిన మంతనాలను ఆయన వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యమం పేరుతో కెసిఆర్ మోసం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.

కాంగ్రెసు పార్టీతో టిఆర్ఎస్ కుమ్మక్కయిందని ఆరోపించారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే కెసిఆర్ ఆరాటమన్నారు. ఆయనకు తెలంగాణ రావాలని లేదన్నారు. తెలంగాణకు మోసం చేస్తున్న కాంగ్రెసు పార్టీని వదిలి తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నేతలు తమ పార్టీని లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. తెలంగాణపై నాన్చుతున్న కాంగ్రెసును ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు.

English summary
TRS chief K Chandrasekhar Rao's Dusserhra dead line for Telangana will end within 24 hours, said TDP senior leader Mothkupalli Narasimhulu on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X