ఉగ్రవాది అజ్మల్ కసబ్ క్షమాభిక్ష పిటిషన్ తోసివేత

కసబ్ క్షమాభిక్ష పిటిషన్ను తోసిపుచ్చాలని ఇంతకు ముందు మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరింది. ఈ పరిణామాన్ని సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికం స్వాగతించారు. హోం మంత్రిత్వ శాఖ సిఫార్సును రాష్ట్రపతి అధ్యయనం చేయాల్సి ఉంటుందని, ఇది మంచి పరిణామమని, ఈ కేసులో ఇది సానుకూల దశ అని ఆయన అన్నారు .
మనం తప్పు చేయకపోవడం సంతోషకరమని, రాష్ట్రపతి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలర్పించిన ఎన్ఎస్డి అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి కె. ఉన్నికృష్ణన్ అన్నారు.
కసబ్కు ఉరిశిక్ష పడితే ఆ శిక్ష అనుభవించినవారిలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారదేశంలో కసబ్ 52వ వాడు అవుతాడు. గత నెలలోనే కసబ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయంతో కసబ్కు ఉరిశిక్ష తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications