హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్‌కు డిప్యూటీ నో రెస్పాన్స్: బొత్స రాజీ యత్నాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - Damodara Rajanarasimha
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలో ముఖ్యమంత్రి ఇందిర బాట కార్యక్రమం మెదక్ జిల్లాలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో దామోదర నియోజకర్గం ఆందోల్‌ను మినహాయించినట్లుగా తెలుస్తోంది. అప్పటికే కిరణ్‌పై గుర్రుగా ఉన్న దామోదర దీంతో మరింత ఆగ్రహానికి గురైనట్లుగా తెలుస్తోంది.

కిరణ్‌పై ఆగ్రహంతో ఉన్న దామోదర ఈ వ్యవహారంతో సొంత జిల్లాలో నిర్వహించి ఇందిర బాట కార్యక్రమంలో పాల్గొనకూడవద్దని నిర్ణయించుకున్నారు. సొంత జిల్లాలో దామోదర బాటలో పాల్గొనకుంటే విమర్శలు ఎదుర్కోవాల్సి రావడమే కాకుండా, ప్రతిపక్షాలకు అవకాశమిచ్చినట్లు అవుతుందని భావించిన కిరణ్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు వెంటనే రంగంలోకి దిగారు.

దామోదర అసంతృప్తిని పోగొట్టేందుకు ముఖ్యమంత్రి ఆయనకు ఫోన్ చేశారు. అయితే దామోదర నుండి ఆయనకు రెస్పాన్స్ రానట్లుగా తెలుస్తోంది. కిరణ్ వెంటనే బొత్సను రంగంలోకి దింపారు. బొత్స సచివాలయంలో దామోదరతో భేటీ అయ్యారు. ఆయన ఇందిర బాట కార్యక్రమంలో పాల్గొనే అంశంపై చర్చిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన దామోదరకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దామోదర ఎంత వరకు వారి విజ్ఞప్తిని మన్నిస్తారో చూడాలి.

English summary

 Deputy CM Damodara Rajanarasimha did not responded to CM Kiran Kumar Reddy's phone on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X