జగన్ ఆస్తుల కేసు: రెండోసారి కోర్టుకు ధర్మాన ప్రసాద్

Dharmana Prasad Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్ ఛార్జీషీటులో మంత్రి ధర్మాన ప్రసాద రావు గురువారం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు. వాన్‌పిక్ కేసులో ఆయన కోర్టుకు హాజరు కావడం ఇది రెండోసారి. ఇదే ఛార్జీషీటుకు సంబంధించిన నిందితులు వైయస్ జగన్, బ్రహ్మానంద రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనుంది. మరోవైపు ఎమ్మార్ అక్రమాస్తుల కేసులో బిపి ఆచార్య, విజయ రాఘవ, శ్రవణ్ గుప్తాలు కోర్టుకు హాజరయ్యారు.

కాగా ఈ కేసులో గతంలో ఓసారి హాజరు కావాల్సినప్పటికీ ధర్మాన హాజరు కాలేదు. తన తల్లి మరణించడంతో విచారణకు హాజరు కాలేకపోతున్నానని సిబిఐ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లి గత గురువారం మృతి చెందిందని, కర్మకాండలు ఇంకా ముగియలేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మంత్రి అభ్యర్థనను సిబిఐ కోర్టు అంగీకరించింది. దీంతో ధర్మాన ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు.

కాగా నెల రోజుల క్రితం మొదటిసారి ధర్మాన కోర్టుకు హాజరయ్యారు. అప్పుడు జగన్‌ను కూడా కోర్టుకు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా జగన్, ధర్మానలు కోర్టు వద్ద షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు జగన్‌కు అరగంట సమయం ఇచ్చారు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతివ్వాలని జగన్ పిటిషన్ పెట్టుకున్న నేపథ్యంలో కోర్టు అనుమతించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+