కష్టపడేవారికే పదవులు, అందరూ లబ్ధి పొందారు: సిఎం

ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లాలో రెండోరోజైన మంగళవారం పర్యటించారు. మెదక్ పట్టణంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రాజకీయాల్లో పదవులు అందరికీ రావని, కష్టపడి పనిచేసేవారికి పదవులు వాటంతట అవే వస్తాయని ఆయన ఈ సమావేశంలో అన్నారు.
అనంతరం మెదక్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యేటా విద్యపై 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారికే పోటీ పరీక్షల్లో ఎక్కువ సీట్లు వస్తున్నాయని అన్నారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి ఆసియా ఖండంలో పెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్ చర్చిని మంగళవారం ఉదయం ఆయన సందర్శించారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మతగురువుల ఆశీస్సులను పొందారు. చర్చి ప్రాముఖ్యను మత గురువురులు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు డీకె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు హనుమంతరావు, నర్సారెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications