జగన్ జైలుకెళ్లకుంటే ఓదార్చే వారు: వైయస్ విజయమ్మ

జగన్ జైలుకు వెళ్లకుంటే అమరవీరుల కుటుంబాలను ఓదార్చే వారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాటలను ఎవరు నమ్మడం లేదన్నారు. వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కంటే తాను తెలంగాణకు ఎక్కువ చేశానని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు.
తన హయాంలో రుణమాఫీలు గుర్తుకు రాని చంద్రబాబు ఇప్పుడు హామీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. నాలుగు వేల మంది రైతుల ఆత్మహత్యలకు కారకుడు బాబు అని ధ్వజమెత్తారు. జగన్ త్వరలో బయటకు వస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కై జగన్ను జైలులో పెట్టాయన్నారు. జగన్ అధికారంలోకి వస్తేనే దివంగత వైయస్ నాటి సువర్ణ పాలన మళ్లీ సాధ్యమన్నారు.
చంద్రబాబు పాలనలో ప్రజలు ముంబయి, దుబాయిలకు వలస పోయారన్నారు. వైయస్ జలయజ్ఞంలో తెలంగాణకే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని, కరెంటు కోసం నానా అవస్థలు పడ్డారని, ప్రతిపక్ష నేత వైయస్ 14 రోజుల పాటు దీక్ష చేశారన్నారు. కాగా సభ ప్రారంభానికి ముందు దివంగత వైయస్, అమర వీరుల కుటుంబాలకు నివాళులు అర్పించారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications