రఘువీరా రెడ్డి పాదయాత్రపై ధ్వజమెత్తిన బైరెడ్డి
రఘువీరా రెడ్డి పాదయాత్రపై ఆయన ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్ల కోసమే రఘువీరా రెడ్డి పాదయాత్రలో మంత్రులు పాల్గొంటున్నారని అన్నారు. తుంగభద్రనీటి చౌర్యంపై వీరు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కర్ణాటక నుంచి నీటి వాటాను సాధించుకునేందుకు అందరం కలిసి పోరాడదామనీ, ఇందుకు అవసరమైతే తాను పట్టుడుకర్రలు సరఫరా చేస్తాననీ అన్నా రు.
హంద్రీనీవా కాలువతో కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు కేవలం రెండు టీఎంసీల నీటిని తీసుకెళ్లినంత మాత్రాన సీమంతా సస్యశ్యామలం అయినట్టేనా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి మరో 45 టీఎంసీల కృష్ణా మిగులు జలాలనైనా రాయలసీమ ప్రాంతానికి కేటాయించేందుకు పోరాడాలన్నారు.
అనంతపురం జిల్లాకు మరో సాగు ప్రాజెక్టుకు అవసరమని, ప్రతిపాదనలు పంపాలని బ్రజేష్ మిశ్రా కమిటీ మూడుసార్లు కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమ హక్కుల కోసం ఉద్యమం సాగిస్తున్నారు. ఇటీవల హైరాబాదులో ఆయన దీక్ష కూడా చేపట్టారు.