తెలంగాణ: కూల్‌గా ఉండమన్న సోనియా, రాహుల్

Sonia Gandhi - Rahul Gandhi
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కూల్‌గా ఉండమని ఆ ప్రాంత పార్లమెంటు సభ్యులకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీలు సోమవారం సూచించారు. ఉదయం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే విపక్షాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబుల అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్‌డిఐలపై చర్చకు పట్టుబట్టారు.

దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా పడ్డాయి. ఈ సమయంలో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు సోనియా, రాహుల్ గాంధీలను పార్లమెంటు లాబీలో కలిశారు. తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉందని, ఈ అంశాన్ని వెంటనే తేల్చాలని విజ్ఞప్తి చేశారు. దీనిని తేల్చకుంటే ఆ ప్రాంతంలో తెలంగాణకు నష్టం జరుగుతుందని వారికి నచ్చజెప్పారు.

వారి మాటలను ఆలకించిన సోనియా, రాహుల్‌లు తెలంగాణ అంశంపై తాము ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిని తేల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అయితే అప్పటి వరకు పార్టీకి ఇబ్బందులు కలిగేలా వ్యవహరించవద్దని సూచించారు. అందుకు ఎంపీలు... తెలంగాణ గురించి సభలో మాట్లాడేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఆమెకు నోట్ ఇచ్చారు. అలాగే తెలంగాణపై వివరించేందుకు తమకు అపాయింటుమెంటు కూడా ఇవ్వాలని కోరారు.

అపాయింటుమెంటుపై సోనియా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. అయితే అప్పటి వరకు కూల్‌గా ఉండాలని పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టవద్దని సూచించారు. సోనియా హామీతో వారు కూల్ అయ్యారు. సోనియాను కలిసిన వారిలో పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ, వివేక, మంద జగన్నాథం తదితర ఎంపీలు ఉన్నారు.

కాగా పన్నెండు గంటలకు తిరిగి ఉభయ సభలు ప్రారంభమైనప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై విపక్షాలు సభను అడ్డుకున్నాయి. దీంతో లోకసభను స్పీకర్, రాజ్యసభను చైర్మన్ మంగళవారానికి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+