వైయస్ జగన్ పార్టీ ఢీలా: 'రెగ్యులర్' పైనే కొండంత ఆశ

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ రాకపోవడంతో ఆ పార్టీ వర్గాలు ఢీలా పడ్డట్లుగా కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు సమయంలోనే బెయిల్ వస్తుందని ఆ పార్టీ నేతలు కళ్లలో వత్తులు పెట్టుకొని చూశారు. ఆ తర్వాత సుప్రీం తీర్పు వారికి పెద్ద షాక్ ఇచ్చినప్పటికీ, జగన్ స్ట్యాట్యూటరీ బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఇప్పుడైనా వస్తుందని భావించారు.

జగన్ బెయిల్ పిటిషన్ తీర్పు వచ్చే వరకు జగన్ పార్టీలో ఉత్కంఠ కనిపించింది. తిరస్కరించడంతో ఒక్కసారిగా వారు ఢీలా పడ్డారు. జగన్ బెయిల్‌ను తిరస్కరించడంతో ఆ పార్టీ నేత జనక్ ప్రసాద్ బుధవారం స్పందించారు. జగన్ బెయిల్ పిటిషన్ పైన కోర్టు తీర్పు దురదృష్టకరమని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థపైన తమకు నమ్మకముందని, బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియదన్నారు.

ఈ నెల 30న జగన్‌కు ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇక ఈ నెల 30కి వాయిదా పడిన రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ పైన కొండంత ఆశలు పెట్టుకుంది. జగన్ స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం తిరస్కరించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+