వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ పార్టీ ఢీలా: 'రెగ్యులర్' పైనే కొండంత ఆశ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ రాకపోవడంతో ఆ పార్టీ వర్గాలు ఢీలా పడ్డట్లుగా కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు సమయంలోనే బెయిల్ వస్తుందని ఆ పార్టీ నేతలు కళ్లలో వత్తులు పెట్టుకొని చూశారు. ఆ తర్వాత సుప్రీం తీర్పు వారికి పెద్ద షాక్ ఇచ్చినప్పటికీ, జగన్ స్ట్యాట్యూటరీ బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఇప్పుడైనా వస్తుందని భావించారు.

జగన్ బెయిల్ పిటిషన్ తీర్పు వచ్చే వరకు జగన్ పార్టీలో ఉత్కంఠ కనిపించింది. తిరస్కరించడంతో ఒక్కసారిగా వారు ఢీలా పడ్డారు. జగన్ బెయిల్‌ను తిరస్కరించడంతో ఆ పార్టీ నేత జనక్ ప్రసాద్ బుధవారం స్పందించారు. జగన్ బెయిల్ పిటిషన్ పైన కోర్టు తీర్పు దురదృష్టకరమని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థపైన తమకు నమ్మకముందని, బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియదన్నారు.

ఈ నెల 30న జగన్‌కు ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇక ఈ నెల 30కి వాయిదా పడిన రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ పైన కొండంత ఆశలు పెట్టుకుంది. జగన్ స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం తిరస్కరించిన విషయం తెలిసిందే.

English summary
YSR Congress party is seeing dull with reject of 
 
 party chief YS Jaganmohan Reddy's bail plea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X