వైయస్ జగన్ పార్టీ ఎంపీ, కొడుకుపై చీటింగ్ కేసు

ఆ పనులు పూర్తైనా సనత్ కుమార్ రెడ్డికి డబ్బులు చెల్లించాల్సిన నగదును ఇవ్వకుండా మేకపాటి వాయిదా వేస్తూ వస్తన్నారు. దీంతో నగదు చెల్లించక పోవడం, నమ్మించి మోసం చేశారంటూ సనత్ రెడ్డిజిల్లా కోర్టును ఆశ్రయించాడు. ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. వాదనలను విన్న జిల్లా కోర్టు మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు ఆయన తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి పైన కూడా చీటింగ్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
దీంతో పోలీసులు మేకపాటి, ఆయన తనయుడు, మరో వ్యక్తి పైన నమ్మకద్రోహం, మోసం కింద కేసు నమోదు చేశారు. కాగా మేకపాటి రాజమోహన్ రెడ్డి గతంలో కాంగ్రెసు పార్టీ ఎంపీగా ఉన్నారు. కొద్ది నెలల క్రితం వైయస్ జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడంతో ఎంపీ పదవికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications