అఫైర్: భార్యను హత్య చేసిన టీచర్, సరెండర్
ఎంవి ప్రభుజీ అనే టీచర్ తన భార్య శారదను బుధవారం తెల్లవారు జామున నాగులపాలెం గ్రామంలోని తన ఇంట్లో హత్య చేశాడు. టీచర్ పోలీసు స్టేషన్కు వెళ్లి విషయం చెప్పిన తర్వాతనే సంఘటన వెలుగు చూసింది. టీచర్ చెప్పిన విషయాన్ని విని పోలీసులు ఒక్కసారిగా నిరుత్తురలయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ శవాన్నిస్వాధీనం చేసుకున్నారు. ప్రభును అదుపులోకి తీసుకున్నారు.
కారంచేడులోని స్వర్ణ గ్రామానికి చెందిన ప్రభు పదేళ్ల క్రితం శారదను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఆమెకు మరో వ్యక్తితో సంబంధం ఉందేమోనని చాలా కాలంగా అనుమానిస్తూ వచ్చాడు. దాంతో ఆమెను ఇంట్లో ఉంచి, తాళం వేసి ఉద్యోగానికి వెళ్లేవాడు. ఇలా నెలల తరబడి గడిచింది.
భర్త తీరుపై శారద తిరగబడింది. దాంతో బుధవారం తెల్లవారు జామున నిద్రలో ఉన్న సమయంలో చీరతో గొంతు నులిమి శారదను అతను చంపాడు. దాంతోనే పైకప్పుకు ఆమెను వేలాడదీసి పోలీసు స్టేషన్కు చేరుకున్నాడు. తన భార్య తీరును తాను సహించలేకనే హత్య చేసినట్లు అతను పోలీసులకు చెప్పాడు. తన భార్యకు మానసిక వ్యాధి ఉందని, దానికి గుంటూరులో చికిత్స చేయించినట్లు అతను చెప్పాడు.