ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అఫైర్: భార్యను హత్య చేసిన టీచర్, సరెండర్

By Pratap
|
Google Oneindia TeluguNews

 Teacher kills wife, surrenders
ఒంగోలు: ప్రకాశం జిల్లా పరుచూరు పోలీసు స్టేషన్ పరిధిలో దిగ్భ్రాంతికరమైన సంఘట చోటు చేసుకుంది. ఓ పాఠశాల ఉపాధ్యాయుడు తన భార్యను హత్య చేసి పరుచూరు పోలీసులకు లొంగిపోయాడు. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. తన భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నదనే అనుమానంతో అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఎంవి ప్రభుజీ అనే టీచర్ తన భార్య శారదను బుధవారం తెల్లవారు జామున నాగులపాలెం గ్రామంలోని తన ఇంట్లో హత్య చేశాడు. టీచర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పిన తర్వాతనే సంఘటన వెలుగు చూసింది. టీచర్ చెప్పిన విషయాన్ని విని పోలీసులు ఒక్కసారిగా నిరుత్తురలయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ శవాన్నిస్వాధీనం చేసుకున్నారు. ప్రభును అదుపులోకి తీసుకున్నారు.

కారంచేడులోని స్వర్ణ గ్రామానికి చెందిన ప్రభు పదేళ్ల క్రితం శారదను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఆమెకు మరో వ్యక్తితో సంబంధం ఉందేమోనని చాలా కాలంగా అనుమానిస్తూ వచ్చాడు. దాంతో ఆమెను ఇంట్లో ఉంచి, తాళం వేసి ఉద్యోగానికి వెళ్లేవాడు. ఇలా నెలల తరబడి గడిచింది.

భర్త తీరుపై శారద తిరగబడింది. దాంతో బుధవారం తెల్లవారు జామున నిద్రలో ఉన్న సమయంలో చీరతో గొంతు నులిమి శారదను అతను చంపాడు. దాంతోనే పైకప్పుకు ఆమెను వేలాడదీసి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నాడు. తన భార్య తీరును తాను సహించలేకనే హత్య చేసినట్లు అతను పోలీసులకు చెప్పాడు. తన భార్యకు మానసిక వ్యాధి ఉందని, దానికి గుంటూరులో చికిత్స చేయించినట్లు అతను చెప్పాడు.

English summary

 In a shocking incident, a schoolteacher murdered his wife and surrendered before the police at Purchur on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X