Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రియాంక గాంధీ, బృందాకారత్ అవయవదానం

న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయ ప్రియాంకా గాంధీ వాద్రా అవయవ దానానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఓ ఆసుపత్రి వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి నిర్వాహకులు అవయవదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రియాంక గాంధీ మరణానంతరం తన అవయవాలను దానం చేస్తున్నట్లు తెలిపారు.

Priyanka Gandhi-Brinda Karat

అయితే ఆమె స్వయంగా రాలేదు. సంక్షిప్త సందేశం(ఎస్సెమ్మెస్) రూపంలో ఆమె ఆసుపత్రి వర్గాలకు పంపారు. అవయవదాతల జాబితాలో తన పేరును కూడా చేర్చాలని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. ఈ సంకల్పానికి ఉపయోగపడుతుందని భావిస్తే తన పేరును కూడా అవయవదాతల పేర్ల జాబితాలో చేర్చాలని, తన పేరును ప్రకటించవచ్చునని, ఈ కార్యక్రమంలో స్వయంగా హాజరవ్వాలని భావించానని, కానీ కుదర లేదని సందేశంలో పేర్కొన్నారు.

ప్రియాంక వాద్రా గాంధీ తన ఇద్దరు పిల్లలకు ఇదే ఆసుపత్రిలో జన్మనిచ్చారు. సిపిఎం(కమ్యూనిస్టు పార్టీ-మార్క్సిస్ట్) నాయకురాలు బృందాకారత్ కూడా అవయవదానానికి ముందుకు వచ్చారు. అవయవదాన సంకల్పానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నానని ఆమె చెప్పారు. తాను కూడా అవయవదానం చేస్తానని ఆసుపత్రి వర్గాలకు బృందాకారత్ చెప్పారు. ఈ అవయవదాన ప్రతినలో సుమారు 500 మంది ప్రతినబూనారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+