వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త హత్యకు భార్య సుపారి: ప్రియుడితో కలిసి ప్లాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Wife's supari for Husband's murder
బెంగళూరు: తన భర్తను హత్య చేసేందుకు ఓ భార్య సుపారీ ఇచ్చిన సంఘటన కర్నాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఓ మహిళ తన భర్తను హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి నలుగురు కిరాయి నిందితులను రంగంలోకి దించింది.

ఈ హత్య వివరాలను నగర పోలీస్ కమిషనర్ జ్యోతి ప్రకాశ్ మిర్జి బెంగళూరులో బుధవారం మీడియా సమావేశంలో తెలియజేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్‌ను హత్య చేసేందుకు ఇరవై అయిదేళ్ల అతని భార్య మంగళ తన ప్రియుడు కిరణ్‌ కుమార్‌తో కలిసి పథకం వేసింది.

తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశ్యంతోనే కుమార్‌ను చంపాలని మంగళ నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తన ప్రియుడికి తెలియజేసింది. కుమార్‌ను హతమార్చేందుకు ప్రియుడు కిరణ్, మంగళలు అని, దీపు, నాగేశ్‌లతో మూడు లక్షల రూపాయలకు కిరాయి ఒప్పందం కుదుర్చుకున్నారు.

పిల్లలను పాఠశాలలో వదిలి తిరిగి వస్తున్న కుమార్‌పై వీరంతా కలిసి నవంబర్ పందొమ్మిదవ తేదిన హనుమంత నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ బస్టాండ్ వద్ద కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.

English summary
A real estate's murder, earlier thought to be a fallout of a dispute over property, turned out to be a shocking incident of contract killing where the victim's wife allegedly offered Rs three lakh to her paramour to get her husband killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X