గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళతో డేటింగ్ చేస్తున్న పెళ్లైన వ్యక్తి నరికివేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Unknown persons killed a man
ఖమ్మం/గుంటూరు: ఓ మహిళతో సహజీనవం చేస్తున్న వ్యక్తిని నరికి చంపిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మాచర్ల మండలంలో శ్రీను అనే వ్యక్తి ఓ మహిళతో గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం అతను ఊరు వదిలి వెళ్లిపోయాడు. మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి మాచర్లలో నివాసం ఉంటుంది. గత రెండు నెలలుగా వారి మధ్య మళ్లీ సహజీవనం ప్రారంభమైంది. శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

దీంతో మంగళవారం అర్థరాత్రి ముసుగులు ధరించిన ఇద్దరు యువకులు బైక్ పైన శ్రీను ఇంటికి వచ్చారు. ఇంటి పైభాగం నుంచి లోపలికి దిగిన ఆ ఇద్దరు యువకులు శ్రీనును గొడ్డలి, కత్తితో దారుణంగా నరికారు. అడ్డుపడిన ప్రియురాలిని మరో వ్యక్తిని గాయపర్చారు. తర్వాత వారు పరారయ్యారు. ఘటనలో శ్రీను మృతి చెందాడు. గాయపడ్డ ఇద్దర్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

టీచర్‌కు దేహశుద్ది

ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం లక్ష్మీదేవిపల్లిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో స్థానికులు దేహశుద్ది చేశారు. అనంతరం వారు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.

English summary
Unknown persons killed a man in Guntur district on Tuesday midnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X