ఆత్మహత్య చేసుకుందాం, రా!: కెసిఆర్కు సురేఖ సవాల్

కెసిఆర్పై, తెరాసపై ఆమె నిప్పులు చెరిగారు. తాను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని, కెసిఆర్ సిద్ధంగా ఉన్నారా అని ఆయన అన్నారు. ఇద్దరం కలిసి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం 10 జనపథ్ ముందు ఆత్మహత్య చేసుకుందామని ఆమె అన్నారు. తేదీని కెసిఆర్ నిర్ణయించాలని, ఏ తేదీన రమ్మంటే ఆ తేదీన కెసిఆర్తో కలిసి ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు.
అఖిలపక్ష సమావేశానికి ముందే ఆత్మహత్యకు పాల్పడితే మంచిదని, దీనికి భయపడి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తారేమో చూద్దామని ఆమె అన్నారు. ప్రస్తుత వివాదం తెలంగాణకు సంబంధించింది కాదని, ఇరు పార్టీలకు మధ్య నెలకొన్న వివాదమని ఆమె అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను కెసిఆర్ స్వప్రయోజనానికి వాడుకున్నారని ఆమె ఆరోపించారు. కెసిఆర్, తెరాస కారణంగానే తెలంగాణలో దాదాపు 800 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె అన్నారు.
తాను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, కెసిఆర్ సిద్ధంగా ఉన్నారా అని ఆమె అన్నారు. ఎండో సల్ఫాన్ తీసుకుని ఇద్దరం ఢిల్లీకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందామని ఆమె కెసిఆర్ను ఉద్దేశించి అన్నారు. చావులెక్కలు కడుతున్నారని కెసిఆర్ తన సవాల్ను స్వీకరించాలని ఆమె అన్నారు. తనను ఆ్మహత్య చేసుకోవాలని కెసిఆర్ కోరడాన్ని తాను స్వాగతిస్తున్నాననని ఆమె అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖ మంగళవారంనాడు అంతకు ముందు అన్నారు. కెసిఆర్ పైన తాను చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకునేది లేదని చెప్పారు. తన ఇంటి పైకి తెరాస కార్యకర్తలు వచ్చి దాడి చేసి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తే తప్పు లేదా అని ప్రశ్నించారు.
తెలంగాణ ఇస్తాం.. తెస్తాం.. అంటూ కెసిఆర్ పన్నెండేళ్లుగా ప్రజలను మభ్య పెడుతున్నారని, మోసం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. తమను విమర్శించే నైతిక హక్కు కెసిఆర్కు లేదన్నారు. పరకాల ఎన్నికల సమయంలో మూడు నెలల్లో తెలంగాణ తీసుకు వస్తుందని ప్రకటించిన కెసిఆర్ ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. కెసిఆర్ తెలంగాణ పేరుతో కోట్లు సంపాదించారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications