తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారికి మాల్యా 3 కిలోల బంగారం ప్రదానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijay Mallya
తిరుపతి: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుతున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్, యుబి గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యా తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామికి బంగారం బిస్కట్లు ప్రదానం చేశారు. వాటి బరువు సుమారుగా మూడు కిలోలు ఉంటుందని అంచనా. తన 58వ జన్మదినం సందర్భంగా మాల్యా మంగళవారం తిరుపతి శ్రీవారి చెంతకు వచ్చారు.

శ్రీవారిని దర్శించుకుని ప్రార్థనలు చేసిన తర్వాత ఆయన బంగారాన్ని ప్రదానం చేసి, దాన్ని పవిత్ర దేవస్థానం ద్వారాలకు బంగారు పూత వేయడానికి వాడాలని ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచించారు. ఈ విషయాన్ని టిటిడి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (దేవాలం) చిన్నంగారి రమణ ఓ వార్తా సంస్థ ప్రతినిధితో చెపపారు.

తన కుటుంబ సభ్యులతో పాటు విజయ్ మాల్యా గత రాత్రి తిరుపతి వచ్చారు. తనకు 15 ఏళ్ల క్రితం వెంకట విజయం విరాళంగా ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహంలో తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు.

విజయ్ మాల్యా ఆగస్టులో కర్ణాటకలోని దక్షిణ కననడ జిల్లాలో గల కుక్కె సుబ్రహ్మణ్య స్వామికి మాల్యా 80 లక్షల రూపాయల విలువ చేసే బంగారు రేకుల ద్వారాలను ప్రదానం చేశారు. మాల్యా 2005లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. ఇది దేశీయ మార్కెట్ వాటాలో రెండో స్థానంలో ఉండేది. ఇప్పుడు అది తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది.

English summary

 Promoter of crisis-ridden Kingfisher Airlines and UB Group Chairman Vijay Mallya made an offering of gold bricks, weighing about three kg, at the famous hill shrine of Lord Venkateswara on his 58th birthday today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X