శ్రీవారికి మాల్యా 3 కిలోల బంగారం ప్రదానం
శ్రీవారిని దర్శించుకుని ప్రార్థనలు చేసిన తర్వాత ఆయన బంగారాన్ని ప్రదానం చేసి, దాన్ని పవిత్ర దేవస్థానం ద్వారాలకు బంగారు పూత వేయడానికి వాడాలని ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచించారు. ఈ విషయాన్ని టిటిడి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (దేవాలం) చిన్నంగారి రమణ ఓ వార్తా సంస్థ ప్రతినిధితో చెపపారు.
తన కుటుంబ సభ్యులతో పాటు విజయ్ మాల్యా గత రాత్రి తిరుపతి వచ్చారు. తనకు 15 ఏళ్ల క్రితం వెంకట విజయం విరాళంగా ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహంలో తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు.
విజయ్ మాల్యా ఆగస్టులో కర్ణాటకలోని దక్షిణ కననడ జిల్లాలో గల కుక్కె సుబ్రహ్మణ్య స్వామికి మాల్యా 80 లక్షల రూపాయల విలువ చేసే బంగారు రేకుల ద్వారాలను ప్రదానం చేశారు. మాల్యా 2005లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ను ప్రారంభించారు. ఇది దేశీయ మార్కెట్ వాటాలో రెండో స్థానంలో ఉండేది. ఇప్పుడు అది తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది.