వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి ఘోర ఓటమి: చేతికి చిక్కిన హిమాచల్ ప్రదేశ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Cong ahead in Himachal Pradesh
సిమ్లా: గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ హవా కొనసాగగా హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెసు దూసుకు పోయింది. అధికార బిజెపికి హమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఝలక్ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెసు గెలవడంతో హిమాచల్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ఇక్కడ మొత్తం స్థానాలు 68 ఉన్నాయి. కాంగ్రెసు 36 స్థానాల్లో గెలుపొంది అధికారం చేజిక్కించుకుంది.

అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెసు హిమాచల్‌లో కేవలం 23 సీట్లే గెలుచుకుంది. ఇప్పుడు మాత్రం 13 సీట్లు ఎక్కువ దక్కించుకొని అధికారాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని సోనియా గాంధీ నిర్ణయిస్తారు. మరోవైపు 41 స్థానాలున్న బిజెపి కేవలం 26 స్థానాలతో సరిపెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ కాంగ్రెసుకు బాగా కలిసి వచ్చింది. ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ గెలుపొందారు.

హిమాచల్ ప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటుందని.. కాంగ్రెసు గెలుస్తుందని సర్వేలు తెలిపాయి. అనుకున్నట్లుగానే ప్రభుత్వ వ్యతిరేకత హిమాచల్‌లో కనిపించింది. అధికార బిజెపికి అక్కడ షాక్ తగిలింది. ఈ రోజు మధ్యాహ్నం లోగా పూర్తి ఫలితాలు వెలువడుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది.

కాగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్‌లో స్పందించిన విషయం తెలిసిందే. ఇక అంతా ముందు చూపేనని.. వెనుక చూపు లేదని ట్వీట్ చేశారు. మణి నగర్ నుండి పోటీ చేస్తున్న మోడీ ఆధిక్యంలో ఉన్నారు. అతని పైన కాంగ్రెసు పార్టీ వ్యూహాత్మకంగా సస్పెన్షన్‌కు గురైన అధికారి భార్య శ్వేతా భట్‌ను బరిలోకి దింపారు. మణి నగర్‌లో మోడీ మంచి ఆధిక్యంలో దూసుకెళ్లుతున్నారు.

English summary
The ruling BJP has a comfortable lead in Gujarat. In Himachal Pradesh a close contest is on between the BJP and Congress. Counting of votes is underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X