పర్మిషన్ అవసరంలేదు: మోపిదేవి,ధర్మానకు నోటీసులు

ఇప్పటికే ఐపిసి సెక్షన్ల కింద అభియోగాలను కోర్టు పరిగణనలోకి తీసుకోగా, తాజాగా అవినీతి నిరోధక చట్టం-1988 కింద తాము నమోదు చేసిన అభియోగాలను విశ్వాసంలోకి తీసుకోవాలని కోర్టును సిబిఐ అధికారులు కోరారు. వారి అభ్యర్థనను స్వీకరించిన నాంపల్లి సిబిఐ కోర్టు వారిద్దరికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను 31కి వాయిదా వేసింది. మంత్రులు, అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినపుడు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.
జగతికి నిధుల పెట్టుబడుల వ్యవహారంలో అప్పటి మంత్రులు ధర్మాన, మోపిదేవి, నలుగురు సీనియర్ ఐఏఎస్లపై సిబిఐ వివిధ సెక్షన్ల కింద నేరాభియోగాలను నమోదు చేసింది. దీంతో ధర్మాన, మోపిదేవిపై పిసి యాక్ట్ కింద నమోదు చేసిన అభియోగాలను పరిగణనలోకి తీసుకోవాలని తాజాగా మెమో దాఖలు చేసింది. నేరం జరిగినప్పుడు ఉన్న పదవుల్లో వారు ఇప్పుడు లేనందున పిసి యాక్ట్ కింద ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలన్న నిబంధన వారికి వర్తించదన్నారు.
చౌతాలా కేసులో సుప్రీం తన తీర్పులో ఇదే అంశాన్ని స్పష్టం చేసిందని సిబిఐ కోర్టుకు వివరించింది. తాము అరెస్టు చేసే నాటికి మంత్రి మోపిదేవి ఎమ్మెల్యేగానే ఉన్నారని ఆ కారణంగా, ఆయన ప్రాసిక్యూషన్కు తాము అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరలేదని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications