నాలాగే గవర్నర్, ఇష్టమొచ్చినట్లు...: సిఎంపై డిఎల్ ఫైర్
ఈ విషయాలన్నింటినీ తాను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. వీటిని అధిష్టానమే చూసుకుంటుందన్నారు. ధర్మాన ప్రాసిక్యూషన్ అంశంలో కేబినెట్ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కేబినెట్ పైన రుద్దటం ఏమిటన్నారు. మంత్రివర్గం విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ధర్మాన ఫైలు పైన తన లాగే గవర్నర్ నరసింహన్ కూడా సంతృప్తి చెందలేదని, అందుకే ఆమోదించకుండా తిప్పి పంపించారన్నారు. ఎవరి పని వారు చేస్తే మంచిందన్నారు. అన్ని విషయాలలో కేబినెట్ జోక్యం తగదన్నారు. సిబిఐ, కోర్టులు తప్పుపట్టినప్పటికీ ధర్మానను వెనుకేసుకు రావడం సరికాదన్నారు. ధర్మాన విషయంలో గవర్నర్ సూన ప్రభుత్వానికి ఇబ్బంది కరమే అని అన్నారు. మంత్రివర్గంలో తాను ఉన్నాను. కాబట్టే ఈ రకంగా స్పందించాల్సి వస్తోందన్నారు.
శ్రీలక్ష్మి పిటిషన్
కాగా తమిళనాడులోని వెల్లూరులు చికిత్స చేయించుకునేందుకు తాను వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులో నిందితురాలు శ్రీలక్ష్మి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.